వింతలకు కొనసాగింపే తప్ప ,ముగింపు అనేదే లేదు..
గత టపాలోని నమ్మలేని వింతలకు ఇది ఒక కొనసాగింపు..
1) ఆ ఊరంతే కవలలే :
కేరళ రాష్ట్రంలోని కోధిని గ్రామం కవలల గ్రామంగా ప్రసిద్ధికెక్కింది ,ఆ ఊరిలో 250 జతల కవలలు ఉన్నారని అంటారు
2) నీటిపై తేలే పోస్టు ఆఫీసు :
source :trending post |
కాశ్మీర్ లో గల దాల్ సరస్సులో ఈ నీటిపై తేలే పోస్ట్ ఆఫీసు ఉంది ...
3) ప్రపంచంలోనే ఎత్తైన క్రికెట్ మైదానం :
హిమాచల్ ప్రదేశ్ లో గల చైల్ క్రికెట్ మైదానం ప్రపంచం అత్యంత ఎత్తు మీద ఉన్న క్రికెట్ మైదానంగా ప్రసిద్ది గాంచింది ,భూమి మీద 2444 మీటర్ల ఎత్తులో నెలకొని ఉంది ...
4) మానవ కంప్యూటర్ :
శ్రీమతి శకుంతల దేవి మానవ కంప్యూటర్ గా ప్రసిద్ది గాంచారు ... 7,686,369,774,870 × 2,465,099,745,779 లాంటి సంక్లిష్టమైన లెక్కకు సమాధానం ఇవ్వడానికి ఈమెకు పట్టిన సమయం కేవలం 28 సెకండ్లు ..
5) దోమల మందులు /నివారణ యంత్రాలు :
మీకు తెల్సా ? నిజానికి మనం వాడుతున్న దోమల నివారణ యంత్రాలు ,దోమల్ని చంపలేవు ,కేవలం వాటికి గల సేన్సార్స్ కి మనల్ని అందకుండా చేస్తాయి అంతే ...
6) ఇక్కడ మీ పాద ముద్రలు చెరిగిపొవు ..
చంద్రుడి మీద మొట్టమొదటి అడుగు 1969లో పడినా కూడా ఇప్పటికి పదిలంగానే ఉందట ,అక్కడ వాతావరణం,గాలి లేకపోవడం ఇందుకు కారణాలుగా శాస్త్రజ్ఞులు చెప్తారు ...
మరిన్ని వింతలు తర్వాత టపాలో చూద్దాం ... సెలవు ...